ద్విపదభాగవతం - మధురకాండ : జరాసంధ కాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట
హరి రాముఁడును దాను నటు విచారించి
పరఁగ యాదవులకాపద వచ్చెఁ జూడు
డిదెవచ్చె బలవంతుఁడీ కాలయవనుఁ
డదె జరాసంధుఁడు నటవంకవచ్చె
నేదికార్యము? మనకీప్రోలనుండ
రాదు; నాశమునొందుఁ బ్రజయిందు నున్న
ననిపల్కి; గోవిందుఁ డబ్దిఁ బ్రార్ధించి
చనుదెంచి దేవతాశైలంబుపొంతఁ
గరమొప్ప విశ్వకర్మనును రావించి
పురము నిర్మింపఁ బంపుటయు నతండు
బహువప్రగోవురభర్మహర్మ్యముల
బహురత్నకనకవిభ్రమచిత్రితముల
తతి చెలంగగను ద్వాదశయోజనములఁ
జతురశ్రమంబుగా సౌభాగ్యలీల
వలను మీరఁగ ద్వారవతి యనుపేరఁ
గలిగింప నప్పురిఁ గని సంతసిల్లి. - 600
తనరారఁ బారిజాతము సుధర్మమును
యనిమిషేంద్రుఁడు శౌరివీధిఁ బుత్తెంచె
ధనదునిఁ దలఁచిన దన మహాద్రవ్య
మెనిమిది కోశంబులిచ్చి పుత్తెంచె,
అధికయోగారూఢుఁ డగు ముకుందుండు
మధురలోపలఁ దన్ను మఱచి నిద్రించు
జనులనెత్తుక రాత్రిచని ద్వారపతినిఁ
దనరు మందిరములఁ దగుభంగి నునిచి
మరలి సీరయుఁ దాను మధుర కేతెంచి